కోజీకోడ్ ‘ప్రమాద విమానంలో’ ఐఫోన్ గుట్ట…!

-

కోజీకోడ్ విమాన ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో 23 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొంత మందికి కరోనా కూడా ఉంది అని అధికారులు పేర్కొన్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. ఈ ప్రమాదంలో ఏవియేషన్ అధికారుల తప్పిదమే ఎక్కువగా ఉంది అని అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ విమానంలో… ఇద్దరు యాత్రికుల నుంచి 18 యాపిల్ ఐఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా విదేశాలకు చెందిన 2 వేల సిగరెట్ లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ చేపట్టిన కోజికోడ్‌కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ వీటిని స్వాధీనం చేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి రూ .10.09 లక్షల విలువైన 201 గ్రాముల ముడి బంగారు గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news