వైరల్ వీడియో.. మందు తాగలేదని వ్యక్తిని డాబాపై నుంచి తోసేసి..!!

-

తమతోపాటు మందు తాగేందుకు అంగీకరించలేదని ఒక వ్యక్తిని మరో నలుగురు డాబాపై నుంచి కిందకు విసిరేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రంజిత్‌ సింగ్‌ అనే వ్యక్తిని ఈ కేసులో బాధితుడిగా గుర్తించారు. ఈ మొత్తం గొడవ సమీపంలోని ఓ సెక్యూరిటీ కెమెరాలో రికార్డవ్వగా ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు మద్యానికి తీవ్రంగా బానిసయ్యారు. వారు బాధితుడు రంజిత్‌ సింగ్‌ స్థానికంగా నిర్వహించే దుకాణానికి తరచూ వచ్చేవాళ్లు. ఈనెల 24వ తేదీ రాత్రి బలవంతంగా అతడి ఇంట్లోకి చొరబడి తమతో కలిసి రంజిత్‌ కూడా మద్యం తాగాలని పట్టుబట్టారు. అందుకు నిరాకరించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా వెళ్లిపోయారు. కానీ, మర్నాడు మరోసారి ఇంట్లోకి చొరబడి డాబాపైకి తీసుకెళ్లి అతడిని డాబాపై నుంచి కిందకు విసిరేశాడు. దీంతో అతడు రోడ్డుపై పడగా.. మిగిలిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. స్థానికులు అతడిని రక్షించి వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసినట్లు లఖ్‌నవూ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news