BREAKING : కారు-బస్సు ఢీకొని ఐదుగురు మృతి

-

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బీజాపుర్ గుహాగర్ జాతీయ రహదారిపై జంబుల్వాడి ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక సమీప ఆస్పత్రులకు తరలించారు. మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. అతివేగం, నిద్రమత్తు లేదా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news