‘నేను దేవుణ్ని.. మళ్లీ బతికిస్తాను’… అంటూ వృద్ధురాలిని కొట్టి చంపాడు

-

తాను దేవుణ్నంటూ.. చనిపోయిన వారిని బతికిస్తానంటూ.. ఓ వ్యక్తి వృద్ధురాలిపై దాడి చేసి హతమార్చాడు. ఇదంతా అక్కడున్న వారు చోద్యం చూశారు. అందులో ఓ వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ జిల్లా గోగుండా తహసీల్‌ పరిధిలో జరిగింది.

ఫుల్​గా మద్యం తాగిన ప్రతాప్‌సింగ్‌ (70) తాను శివుడి అవతారమని ఊగిపోయాడు. ఎదురుగా కనిపించిన కల్కిబాయ్‌ గమేతి (85) అనే వృద్ధురాలితో ‘నువ్వు మహారాణివి.. నిన్ను చంపి మళ్లీ బతికిస్తా’ అంటూ ఆమె ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. కింద పడిపోయిన వృద్ధురాలిని చేతిలో ఉన్న గొడుగుతో చితకబాదాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె మరణించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కల్కిబాయ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని ఇంటికి వృద్ధురాలు నడుచుకొంటూ వెళ్తుండగా ప్రతాప్‌సింగ్‌ ఆమెకు తారసపడ్డాడని పోలీసులు చెప్పారు. అనుమానితులు నలుగురినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఉదయ్‌పూర్‌ ఎస్పీ భువన్‌ భూషణ్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news