ఛతీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఇద్దరూ మావోయిస్టులు మృతి

-

ఛతీస్ గడ్ లో మరోసారి తుపాకుల మోత దద్దరిల్లింది. నారాయణపూర్ జిల్లాలో ఆదివారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరూ మావోయిస్టులు మరణించగా.. కొందరూ పోలీసులు గాయపడ్డారు. ఘటన స్థలంలో పోలీసులు భారీగా మావోయిస్టుల సామాగ్రీని స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version