మెగాస్టార్ ని కలిసిన శివన్న.. చిరు అంటే ఎంత ప్రేమో..!

-

సినీ పరిశ్రమకు అందించిన సేవలకు మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. దీంతో చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఆయనను ఇంటికి వెళ్లి మరి అభినందించారు. ఈ తరుణంలోనే చిరంజీవి కోసం రాజకీయ, ప్రముఖుల కోసం ప్రత్యేక విందు పార్టీ కూడా ఇచ్చాడు. ఇకపోతే ఇవాళ  తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సన్మానించింది. ఆయనతోపాటు పద్మ అవార్డులను అందుకున్న వారందరినీ  ఘనంగా సత్కరించింది.

తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మెగాస్టార్ ను అభినందించాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వచ్చి మరీ చిరంజీవి ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా  వెల్లడించారు. ప్రియమైన స్నేహితుడు శివన్న నాకోసం ఇక్కడ వరకు రావడం చాలా సంతోషం అన్నారు.  ఆయన చేసిన పనికి.. నిద్ర కలిసి భోజనం చేశావా..? చాలాసేపు కబుర్లు మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version