ఈనెల 18 నుంచి భారత్‌లో మిస్ట్ వరల్డ్ పోటీలు

-

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ప్రపంచ సుందరి పోటీలు ’ భారత్ కు వచ్చేశాయి. 71వ మిస్ట్ వరల్డ్ పోటీలు ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు భారత్‌ వేదికగా జరగనున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ వేడుకను భారత్‌లో నిర్వహించడంతో నిర్వాహకులు ఈ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భారత్ లో చివరిసారిగా 1996లో ఈ పోటీలు నిర్వహించారు.

ఇక తాజా పోటీల్లో భాగంగా ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఈనెల 20న దిల్లీలో ‘ది ఓపెనింగ్‌ సెర్మనీ’, ‘ఇండియా వెల్‌కమ్స్‌ ది వరల్డ్‌ గాలా’ కార్యక్రమాలతో ఈ ప్రదర్శన మొదలవనుంది. మార్చి 9న ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఫైనల్స్‌ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కాతో పాటు మాజీ విజేతలు తోని అన్‌ సింగ్‌(జమైకా), వనెస్సా పోన్సీ డి లియోన్‌(మెక్సికో), మానుషీ చిల్లర్‌(భారత్‌), స్టిఫేనీ డెల్‌ వాలీ(ప్యూర్టో రికో)లు హాజరైన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news