మహ్మద్ షమీ పెద్ద క్రిమినల్.. ముస్లిం సంస్థ చీఫ్ ఆగ్రహం..!

-

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, షమీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షమీ ఓ క్రిమినల్ అంటూ విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కారణంగా షమీ రంజాన్ మాసంలో రోజా పాటించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగుతూ.. ఇతర కూల్ డ్రింక్స్ తాగుతూ కనిపించాడని షాబుద్దీన్ పేర్కొన్నాడు.

ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశాలను పంపుతుంది. రోజాని పాటించకపోవడం ద్వారా అతను నేరం చేశాడు. అతను అలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతను ఓ నేరస్తుడు. అతను దేవుడికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఓ వీడియో మెసేజ్ లో షాబుద్దీన్ పేర్కొన్నారు. షమీని విమర్శిస్తూ రంజాన్ సందర్భంగా రోజా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యంగా ఉన్న ఏ పురుషుడు, స్త్రీ అయినా రోజా పాటించకపోతే పెద్ద నేరస్తులు అవుతారని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news