Mukesh Ambani : ఐస్​క్రీమ్ బిజినెస్​లోకి ముకేశ్ అంబానీ

-

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కన్ను మరో రంగంపై పడింది. పెట్రోల్​, ఎలక్రానిక్స్​, క్లాథింగ్​, టెలికాం, ఎనర్జీ ఇలా అన్నింట్లోనూ విస్తరించిన ఇండస్ట్రీని ఇప్పుడు మరో మెట్టు ఎక్కించే పనిలో పడ్డారు. తమ రిటైల్​ వెంచర్స్​లోని ఎఫ్​ఎంజీసీ కంపెనీల స్వతంత్ర బ్రాండ్‌తో ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని సమాచారం.

గతేడాది గుజరాత్‌లోనే రిలయన్స్​ ఈ బ్రాండ్‌ను విడుదల చేయగా.. ఇప్పుడు మార్కెటింగ్​ కోసం అక్కడి ఐస్​క్రీమ్ తయారీ అవుట్ సోర్సింగ్ కంపెనీలతో చర్చలు జరుపుతోందట. ఇక ఐస్​క్రీమ్​ రంగంలోకి రిలయన్స్ ప్రవేశిస్తే ఇక్కడి మార్కెట్‌లో కూడా తప్పక పోటీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్​ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ కంపెనీ ఈ ఉత్పత్తిని తమ ఎఫ్‌ఎంజీసీ విభాగంలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందట. మరోవైపు గుజరాత్‌కు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీతో చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే ఈ వేసవిలోనే కంపెనీ తన సొంత ఐస్‌క్రీమ్‌ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version