కేటీఆర్, పొంగులేటికి మహేశ్వర్ రెడ్డి సవాల్..!

-

బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ ఎంక్వైరీని కాంగ్రెస్ కోరడం లేదని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఒప్పందం కుదిరి మీకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. అమృత్ టెండర్ల విషయంలో కేంద్రానికి నివేదిక ఇచ్చామని  తెలిపారు. 

ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే నేను సైలెంట్ అయ్యానని మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడుతుందని.. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లి కే.సీ. వేణుగోపాల్ తో ఏం ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version