World Cup 2023 : భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు బెదిరింపు

-

ముంబై వాంఖడే స్టేడియంకి బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేపుతోంది. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరిగే సమయంలో ఘోరం జరుగుతుందని తమకు X లో మెసేజ్ వచ్చిందని ముంబై పోలీసులు వెల్లడించారు. ‘గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది.

వాంఖడే స్టేడియంలో గోరం జరుగుతుందని చెప్పాడు. తుపాకీ, హ్యాండ్ గ్రనైడ్స్, బుల్లెట్స్ చూపించాడు. భద్రత కట్టుదిట్టం చేశాం’ అని పోలీసులు తెలిపారు. కాగా.. సెమీస్ పోరులో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. ముంబై వాంకడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జట్టు ఫామ్ ను బట్టి చూస్తే టీం లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగడం ఖాయం. ఇటు ఆల్ రౌండ్ నైపుణ్యంతో కివీస్ జట్టు గొప్పగా కనిపిస్తోంది. ఏది ఏమైనా డబ్ల్యూసి 2019 సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version