పీవీ సింధుకు థార్ వాహ‌నం ఇవ్వాల‌న్న నెటిజ‌న్.. ఆనంద్ మ‌హీంద్రా రియాక్ష‌న్ ఇదీ..!

-

టోక్యోలో జ‌రుగుతున్న ఒలంపిక్స్‌లో ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ ప్లేయ‌ర్ పీవీ సింధు కాంస్య ప‌త‌కాన్ని సాధించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే సింధును యావ‌త్ భారత దేశం కొనియాడుతోంది. అంద‌రి నుంచి ఆమెకు అభినంద‌న‌లు వ‌స్తున్నాయి. ఇక ఇది వ‌ర‌కే ఆమె సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడ‌ల్స్ ను సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా సింధు రికార్డు సృష్టించింది.

netizen demands thar for pv sindhu see how anand mahindra reacted

అయితే సింధు ఈ ఘ‌న‌త సాధించ‌డంతో ఆమెకు మ‌హీంద్రాకు చెందిన థార్ వాహ‌నాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాల‌ని ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు ట్వీట్ చేశాడు. అయితే అందుకు ఆనంద్ మ‌హీంద్రా స్పందించారు.

పీవీ సింధు గ్యారేజ్‌లో ఇప్ప‌టికే ఒక థార్ వాహ‌నం ఉంద‌ని ఆనంద్ మ‌హీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయ‌న సింధును పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య ప‌త‌కం వ‌చ్చినా ఆమె చేసిన కృషి అద్భుత‌మని, ఆమెకు బంగారు ప‌త‌కం వ‌చ్చిన‌ట్లుగానే తాను భావిస్తున్నాన‌ని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడ‌ల్ సాధించ‌డం అంత ఆషామాషీ కాద‌న్నారు.

కాగా 2016లో బ్రెజిల్ రాజ‌ధాని రియోలో నిర్వ‌హించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వ‌ర్ మెడ‌ల్ వ‌చ్చింది. అలాగే రెజ్ల‌ర్‌ సాక్షి మాలిక్‌కు కాంస్య ప‌త‌కం వ‌చ్చింది. దీంతో అప్ప‌ట్లో ఆనంద్ మ‌హీంద్రా ఆ ఇద్ద‌రికి చెరొక థార్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చారు. అదే విష‌యాన్ని ఆయ‌న తాజాగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news