కావడియాత్రలో పెను విషాదం.. కరెంట్ షాక్ తో 9 మంది భక్తులు మృతి

-

బిహార్‌లోని హాజీపుర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వైశాలిలో కావడి యాత్రలో కావడి యాత్ర భక్తులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హై టెన్షన్‌ వైర్‌ తగిలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదివారం రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు.

ఈ ఘటన వైశాలిలోని హాజీపూర్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సుల్తాన్‌పుర్‌ ప్రాంతంలోని హరిహరనాథ్‌ ఆలయంలో పూజలు చేసేందుకు కన్వర్ యాత్రికులు డీజే ట్రాలీలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో డీజే సెటప్ చాలా ఎత్తుగా ఉండడం వల్ల హై టెన్షన్ తగిలింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారని.. మరికొందరు గాయపడ్డారని హజీపుర్ ఎస్డీపీఓ ఓం ప్రకాశ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news