పొలం బాటలో కలెక్టర్ దంపతులు.. భార్యతో కలిసి నాటు వేసిన రాహుల్ రాజ్

-

నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే కలెక్టర్ ఆదివారం రోజున సరదాగా పొలం బాట పట్టారు. తన సతీమణి, ఇద్దరు కుమార్తెలను తీసుకుని పొలంలోకి దిగారు. కాసేపు రైతులతో ముచ్చటించి కుటుంబంతో కలిసి వరినాట్లు వేశారు. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరంటే..?

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆయన సతీమణి శ్రీజ తమ కుమార్తెలతో కలిసి ఆదివారం రోజున స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ఓ రైతు పొలంలో వరి నాట్లు వేశారు. అనంతరం కలెక్టర్‌ వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు ఇచ్చారు. సాగుకు సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే తనను సంప్రదించాలని.. వ్యవసాయ నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సందేహాలు తీర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news