పాండ్యన్‌ నా వారసుడు కాదు: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

-

వి.కార్తికేయ పాండ్యన్‌ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. మరో అయిదేళ్లు రాష్ట్రాన్ని తానే పాలిస్తానని తెలిపారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ అనేక విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన ఆరోగ్యంపై స్పందిస్తూ.. తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి రుగ్మతలు లేవని, గడిచిన నెల రోజుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. దిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నేతలు తన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, పదేళ్లుగా ఇది వింటున్నానని అన్నారు.

మరోవైపు పాండ్యన్‌ తన సక్సెస్‌లో సూత్రధారి కాదని, ప్రజలు తన విజయానికి కారణమని పట్నాయక్ స్పష్టం చేశారు. అయితే పాండ్యన్‌ ఉన్నత వ్యక్తిత్వం తనకు నచ్చిందని తెలిపారు. ఈసారి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో బీజేడీకి స్పష్టమైన మెజార్టీ తథ్యమని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరో ఐదేళ్లు ఒడిశాను తానే పాలిస్తానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news