వాహనదారులకు బిగ్ అలర్ట్. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పాత వాహనాలను గుర్తించేందుకు బంకులలో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగతా నేషనల్ క్యాపిటల్ రీజియన్ నగరాలలోనూ 2026 మార్చి 31 లోగా ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి వాసులు సంతోషపడుతున్నారు. కాలుష్యం కొంతమేరకైనా తగ్గుతుందని అంటున్నారు.