రేపు సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌

-

సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం రోజున 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 58 స్థానాల్లో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మే 25 న జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది.

ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది.  ఈ విడతలోనే హరియాణాలోని 10, దిల్లీలోని 7 సీట్లకూ  ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా ..కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకుల తలెత్తాయి. దీంతో మే 25న ఆరో విడతలో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news