ఒకేసారి ఐదు వందే భారత్‌ రైళ్లు ప్రారంభించిన ప్రధాని

-

భారత ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర సర్కార్ ఇప్పటికే వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. ఇక తాజాగా మరో 9 నగరాల మధ్య 5 వందేభారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో.. భోపాల్‌-ఇండోర్, భోపాల్‌-జబల్‌పుర్‌ వందేభారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

ధార్వాడ్‌-బెంగళూరు, రాంచీ-పట్నా, గోవా-ముంబయి వందేభారత్‌ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​, మధ్యప్రదేశ్ గవర్నర్‌ మంగూభాయ్‌ పటేల్‌, సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. వందే భారత్‌ రైల్లో చిన్నారులతో కాసేపు మోదీ ముచ్చటించారు. వందేభారత్‌ రైళ్లతో.. మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలకు రైలుప్రయాణం మరింత మెరుగవుతుందని తెలిపారు. మరోవైపు ఒకేరోజు ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించటం ఇదే తొలిసారి అని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news