ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం దక్కింది. ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డు ప్రదానం చేశారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ చేతుల మీదుగా సత్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చారు ప్రధాని మోడీ.

మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని మోదీ. ఐదు దేశాల పర్యటనలో ప్రధాని మోదీ ఉన్నారు. ఘనాకు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం పలికారు ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా. రెండు రోజులు ఘనాలోనే పర్యటించనున్నారు ప్రధాని మోదీ. భారత్-ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు ఇరు దేశాల నేతలు.