ఎల్లుండి వాయనాడ్ కు ప్రధాని నరేంద్రమోడీ..షెడ్యూల్ ఇదే

-

ఎల్లుండి వాయనాడ్ కు ప్రధాని నరేంద్రమోడీ వెళ్లనున్నారు. అంటే ఆగస్టు 10వ తేదీన, ప్రధాని నరేంద్రమోడీ వాయనాడ్ లో పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో ఏరియల్ సర్వే చేయనున్నారు ప్రధాని మోడీ. ఆగస్టు 10వ తేదీన, మధ్యాహ్నం 12 గంటలకు వాయనాడ్ కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ప్రధాని మోడీ పరిశీలించనున్నారని సమాచారం. కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌ను సందర్శించి, గత నెలలో దక్షిణాది రాష్ట్రాన్ని తాకిన విపత్తు నుండి బయటపడిన వారితో సంభాషించనున్నట్లు సమాచారం.

PM Modi to visit landslide-struck Wayanad on Aug 10

ఇందులో భాగంగానే… ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక విమానంలో కన్నూర్‌లో దిగనున్నారు. కన్నూరు నుంచి ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ప్రస్తుతం 10,000 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్న కొన్ని సహాయ శిబిరాలను ఆయన సందర్శిస్తారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లు…. ప్రధాని మోదీ కన్నూర్‌కు వచ్చిన తర్వాత ఆయన వెంట వస్తారని భావిస్తున్నారు. కాగా, ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news