మంత్రికి చికిత్స చేస్తుండగా ఆస్పత్రిలో కరెంట్ కట్.. తర్వాత ఏమైందంటే..?

-

మహారాష్ట్ర క్యాబినెట్​ మంత్రికి దంత చికిత్స చేస్తున్న సమయంలో ఆస్పత్రిలో అకస్మాత్తుగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. షాకైన వైద్యులు  ఏం చేయాలో తెలియక సెల్​ఫోన్​ టార్చ్ వెలుగులోనే ట్రీట్​మెంట్​ పూర్తి చేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఔరంగాబాద్ నగరంలోని ఘటి ఆస్పత్రి తనిఖీకి క్యాబినెట్‌ మంత్రి సందీపన్‌ భుమ్రే వెళ్లారు. అక్కడి వైద్యులతో ఆయన దంత పరీక్షలు చేయించుకున్నారు. రూట్‌కెనాల్‌ చికిత్స చేసుకోవాల్సిందిగా సందీపన్​ కు వైద్యులు సూచించగా.. రూట్​కెనాల్​ చేసేయమని సందీపన్​ డాక్టర్లను కోరారు.

చికిత్స మొదలు పెట్టిన తర్వాత మధ్యలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్యులు సెల్‌ఫోన్‌ కాంతిలోనే చికిత్స పూర్తి చేయాల్సి వచ్చింది. దీనిపై వివరణ అడగ్గా.. జనరేటర్‌ కావాలని కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను అక్కడిక్కడే ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version