ఫ్రాన్స్ లో న్యూ ఇండియన్ కాన్సులేట్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

-

ఫ్రాన్స్ ని మార్సెయిల్లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్  సంయుక్తం గా ప్రారంభించారు. అంతకు ముందు మేక్రాన్ తో కలిసి భారత అమరవీరులకు మోడీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది. కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్  చే దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు పీఎంఓ వెల్లడించింది.  ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది.

సాంకేతికత, రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మంగళవారం పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ  సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పలు దేశాల అధినేతలు, టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటితో ఫ్రాన్స్ పర్యటనను ముగించుకొని.. సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version