BREAKING : ఒబెరాయ్ హోటల్స్ ఛైర్మన్ కన్నుమూత

-

BREAKING : ఒబెరాయ్ హోటల్స్ ఛైర్మన్ కన్నుమూశారు. ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పిఆర్ఎస్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. తమ ప్రియతమ నాయకుడు పిఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూశారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

PRS Oberoi, patriarch of Oberoi Hotels, passes away
PRS Oberoi, patriarch of Oberoi Hotels, passes away

ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతో పాటు భారత్, విదేశీ ఆతిధ్యరంగానికి తీవ్రమైన నష్టమని ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయని వివరించారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ చారిటబుల్ ట్రస్ట్ ఫామ్ లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news