మేకప్‌తో మాయ చేసిన బామ్మ… 34 ఏళ్ల యువతిగా పెళ్లి చేసుకుని భారీ మోసం

-

తమిళనాడులో ఓ 54 సంవత్సరాల మహిళ తన మేకప్ తో 35 ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. తిరువల్లూరులోని హరి… ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. కొన్ని కారణాల వల్ల తన భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ బ్రోకర్ ద్వారా పుత్తూరు కు చెందిన శరణ్య హరికి పరిచయమైంది. ఆమె వివరాలు నచ్చడంతో పెళ్లికి సై అన్నాడు. దీంతో 54 సంవత్సరాల శరణ్య.. 34 ఏళ్ల యువతుల పెళ్లి చూపులకు రెడీ అయింది.

దీంతో ఎదురు కఠినంగా 25 సావర్ల బంగారం పెట్టాడు హరి. పెళ్లయిన తర్వాత శరణ్య వాళ్లకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. ఆస్తులన్నీ తన పేరు మీద రాయించుకుంది. అతను ఇంటి నుంచి బయటికి గెంటేసింది. హరి భావించాడు.

ఈ నేపథ్యంలోనే ఆమె ఆధార్ కార్డు బయటికి తీయగా అసలు వయసు బయటపడింది. దీంతో స్థానికులను ఆశ్రయించారు హరి మరియు ఇంద్రాణి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో చార్జింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను వదిలేసిన శరణ్య… పెళ్లిళ్ల బ్రోకర్లను కలిసి విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసేదట. ఇప్పటికే ఇలా మేకప్ వేసుకుని ముగ్గురిని మోసం చేసిందని పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం ఈ మహిళ పోలీసులు అదుపులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news