పాకిస్థాన్‌కు పారిపోయినా వదలం.. వెంటాడి మరీ మట్టుపెడతాం : రాజ్‌నాథ్‌ సింగ్

-

దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది ప్రయత్నించినా తగిన సమాధానం చెప్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలమని, అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతామని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.

ప్రధాని మోదీ చెప్పింది అక్షరాలా నిజమన్న రక్షణ మంత్రి.. భారత్‌ శక్తిని పాకిస్థాన్‌ అర్థం చేసుకోవడం ప్రారంభించింది అన్నారు. అలాగే భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదని, వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదని తెలిపారు. తన పొరుగుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుందని, ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు.

బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ పత్రిక భారత్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూదిల్లీ లక్ష్యంగా చేసుకొందని పేర్కొంటూ.. భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది.

Read more RELATED
Recommended to you

Latest news