ఫేస్‌బుక్‌ లైవ్‌లో కాల్పులు.. శివసేన నేత మృతి

-

శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) నేత ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. అతడిపై దాడి చేసిన నిందితుడు  తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన అభిషేక్‌ ఘోసాల్కర్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. స్థానిక ఉద్యమకారుడైన నోరాన్హకు, అభిషేక్‌కు మధ్య కొంతకాలంగా వ్యక్తిగత వైరం ఉంది. తాజాగా ముంబయిలోని బొరివిల్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీ అభివృద్ధి పనుల కోసం మాట్లాడుకోవడానికి నోరాన్హ తన కార్యాలయానికి అభిషేక్‌ను ఆహ్వానించి అక్కడికి వెళ్లిన అభిషేక్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతుండగా నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. గమనించిన స్థానికులు అభిషేక్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం నోరాన్హ తనని తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news