World Cup 2023 : టీమిండియాకు షాక్‌.. పాక్‌ మ్యాచ్‌ కు కీలక ప్లేయర్‌ దూరం !

-

టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ ఆస్పత్రి పాలయ్యాడు. గత కొన్ని రోజులుగా డెంగ్యూ బారిన పడి.. చికిత్స తీసుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్.. ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ప్రకటించింది. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ చికిత్స తీసుకుంటున్నాడని పేర్కొంది.

Shubman Gill hospitalized in Chennai as platelet count drops, Reports
Shubman Gill hospitalized in Chennai as platelet count drops, Reports

అయితే.. వన్డే వరల్డ్ కప్ లో భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లకు దూరమైన స్టార్ బ్యాటర్ గిల్ ఈ నెల 14న పాకిస్తాన్ తో జరిగే కీలక మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని జాతీయ మీడియా పేర్కొంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న గిల్ చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ లోపు టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ కోలుకుంటే… జట్టులో చేరుతాడు. లేకపోతే చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news