SRH కెప్టెన్‌ గా శుభ్ మన్ గిల్ ?

-

 

టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ గురించి తెలియని వారుండరు. అయితే.. ఈ టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ కు గుడ్ బై చెప్పే యోచనలో గిల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఐపీఎల్ 2024లో శుబ్ మన్ గిల్ సన్రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఆరెంజ్ ఆర్మీలో ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా జట్టును నడిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ శుబ్ మన్ గిల్ కు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్లు ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ తో పాటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version