నేడు దిల్లీలో ‘తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహ సమావేశం’

-

తెలంగాణలో పూర్వ వైభవం దక్కించుకోవడమే గాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ దృఢంగా సంకల్పించిన విషయం తెలిసిందే. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. ముందుగా ఆపరేషన్ ఆకర్ష్.. ఘర్ వాపసీలతో కీలక నేతలను పార్టీలో చేర్చుకుని క్యాడర్​ను బలపర్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర బీఆర్ఎస్ నేతలను హస్తం పార్టీ చేర్చుకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహ సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, మల్లు రవి తదితరులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version