World Cup 2023 : నేడు భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్లు విడుదల

-

క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఆడే మ్యాచ్ల టికెట్లను BCCI విడుదల చేయనుంది.

అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా (చెన్నై), అక్టోబర్ 11న భారత్-ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ), అక్టోబర్ 19న భారత్-బంగ్లాదేశ్ పూణే మ్యాచ్ టికెట్లు ఇవాళ రాత్రి 8 గంటలకు రిలీజ్ అవుతాయి. tickets.cricketworldcup.com వెబ్సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

కాగా, నిన్నటి నుంచే శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా ఆసియా కప్ 2023 ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఇందులో ఇండియా, పాకిస్తాన్ , శ్రీలంక , నేపాల్, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక అన్ని టీం లో కసరత్తులతో సమాయత్తం అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news