మహిళా ఎంపీతో కాంగ్రెస్ నేత శశిథరూర్ ఫొటోలు వైరల్

-

తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్​ నేత శశిథరూర్​ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఫొటోల్లో మోయిత్రా సిగరెట్​, షాంపైన్​ తాగుతున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఆమె శశిథరూర్​తో క్లోజ్​గా ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫొటోలపై ఎంపీ మహువా మోయిత్రా స్పందించారు. ఈ ఫొటోలు మార్ఫింగ్ చేశారని.. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్​ క్రాపింగ్​ చేసిన ఫొటోలకు బదులు.. పూర్తి​ ఫొటోలను అప్లోడ్​​ చేస్తే బాగుండేదని అన్నారు. మరోవైపు నెట్టింట తనపై వస్తున్న ట్రోల్స్​పైనా మహువా స్పందించారు. తాను సిగరెట్​ తాగనని, అదంటే తనకు అలర్జీ అని స్పష్టం చేశారు. కానీ.. స్నేహితులతో ఉన్నప్పుడు ఊరికే అలా పోజ్ ఇస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news