తెలంగాణా ప్రజలకు ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు…!

-

బతుకమ్మ పండుగ నేపధ్యంలో తెలంగాణా ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. తెలంగాణా సిఎం కేసీఆర్ నిన్న తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా శుభాకాంక్షలు చెప్తూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. “ప్రకృతితో మమేకమై జరుపుకునే ‘బతుకమ్మ’ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు.

venkayya naidu
venkayya naidu

మన జీవసృష్టికి ప్రకృతే మూలం. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమని నేను బలంగా విశ్వసిస్తాను. నవరాత్రుల్లో.. అమ్మవారిని ప్రకృతిశక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ బతుకమ్మ పండుగలో కులాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఓ చక్కటి సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ బతుకమ్మను జరుపుకోవాలని సూచిస్తున్నాను.” అని ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news