VIRAL VIDEO : దారుణం.. కదులుతున్న రైళ్లోనుంచి తోసేశాడు

-

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న రైళ్లో నుంచి తోటి ప్రయాణికుడిని ఓ వ్యక్తి బయటకు తోసేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని కాపాడిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సజల్‌ షేక్‌ అనే వ్యక్తి హావ్‌డా-మాల్దా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి తన ఇంటికి వెళ్తున్నాడు. దుర్భాషలాడుతున్నాడని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ.. సజల్‌తో ఓ వ్యక్తి గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడైన సజల్‌ అతడిపై చేయిచేసుకున్నాడు. విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి యువకుడిని రైళ్లో నుంచి బయటకు తోసేశాడు. తర్వాత తనకేం తెలియనట్లుగా వెళ్లి సీట్లో కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పట్టాల పక్కన గాయాలతో నిస్సహాయ స్థితిలో పడిఉన్న బాధితుడిని గుర్తించిన రైల్వే పోలీసులు అతడిని బిర్భూమ్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వద్ద వాంగ్మూలం సేకరించగా నలుగురు సభ్యులు గల బృందం ఆకతాయి చేష్టలను నిలువరించేందుకు వెళ్తే ఇలా చేశారని ఆరోపించాడు.

‘కొంతమంది గట్టిగట్టిగా మాట్లాడుతూ ఇతరులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. నా పక్కనే కూర్చున్న ఓ కుటుంబం అసౌకర్యానికి గురైంది. ఈ విషయాన్ని వారికి చెప్పేందుకు వెళ్లడమే నేను చేసిన తప్పు’ అంటూ వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version