రోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ

-

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం నేటి యువత చిత్రవిచిత్రాలు చేస్తోంది. ముఖ్యంగా రీల్స్ చేయడం కోసం ఎన్నో స్టంట్లు చేస్తోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొన్ని సార్లు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కాదేదీ రీల్స్ చేయడానికి అనర్హం అన్నట్లు ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఫోన్లతో తమ ప్రదర్శనలు షురూ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, మెట్రో స్టేషన్లు, పార్కులు, షాపింగ్‌ మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటున్నారు.

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రోడ్డుపై రీల్స్‌ చేస్తున్న మహిళ మెడలోంచి గొలుసు చోరీకి గురైంది. అవాక్కైన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘజియాబాద్‌లోని ఇంద్రాపుర్‌ ప్రాంతానికి చెందిన సుష్మా అనే మహిళ ఆదివారం రోజున సర్వీస్ రోడ్డుపై రీల్ చేస్తూ..కెమెరా వైపు నడుచుకుంటూ వస్తుండగా.. అదే సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news