బ్రేకింగ్ : సరూర్‌ నగర్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

-

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో నిన్న గల్లంతైన నవీన్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. స్కూటీపై ప్రయాణిస్తున్న నవీన్‌కుమార్‌ సరూర్‌నగర్‌ చెరువులోకి కొట్టుకుపోయారు. దీంతో 24 గంటలకుపైగా నవీన్‌కుమార్‌ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. అయితే, చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారాలు, బురదకు తోడు వరద కొనసాగుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

నవీన్ మృతదేహం బురదలో కూరుకుపోయిందని భావిస్తోన్న అధికారులు ఆ మేరకు ప్రయత్నాలు చేసారు. 24 గంటలు దాటిన తర్వాత మృతదేహం బయటికి తేలే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు చెరువులోకి నిరంతరాయంగా వరద చేరుతున్న క్రమంలో వరద నీరుపారుతున్న ప్రాంతాల్లో జాలీలను ఏర్పాటు చేశారు అధికారులు. అలా ఎట్టకేలకు గల్లంతైన ప్రదేశానికి 30 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశాయి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.

Read more RELATED
Recommended to you

Latest news