నక్సల్స్ దుశ్చర్య.. ఏపీకి చెందిన జవాన్ మృతి

-

మావోయిస్టుల దుశ్చర్య వలన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ రాజేష్ ప్రాణాలు కోల్పోయాడు. నక్సల్స్ అమర్చిన మైనింగ్‌ బాంబు పేలి శనివారం సాయంత్రం ఇద్దరు జవాన్లు మృతి చెందిన ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రాలోని బ్రహ్మం గారి మఠం మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన జవాన్‌ రాజేష్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

జవాన్ మరణంతో పాపిరెడ్డి పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఆయన స్వగ్రామానికి జవాన్ మృతదేహం చేరుకోనుండటంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుంటున్నారు.కాగా,మావోయిస్టుల ఘాతుకానికి బలైన జవాన్‌ రాజేష్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలాఉండగా, ఈ మధ్యకాలంలో మావోయిస్టుల హంటింగ్ పెరిగింది. దీంతో పక్కాపథకం ప్రకారం నక్సల్స్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version