ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయము : కొత్తపల్లి గీత

-

ఎన్నికలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి..తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఇందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంపచోడవరంలో గిరిజనులను, గిరిజనేతరులను గుప్పెట్లో పెట్టుకొని నియంతలా పాలిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గతంలో ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లను స్థానికులు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలు కోరిన పనులను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని కొత్తపల్లి గీత హామీనిచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుమూల గ్రామాలలో రంపచోడవరం నియోజవర్గ అభ్యర్థిని మిరియాల శిరీష దేవితో కలిసి బైక్ ర్యాలీ రోడ్డుషో పర్యటన చేపట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని.. ఈ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news