ASIA CUP 2022 : పంత్ కు చేతబడి చేసిన ఊర్వశి రౌతేలా.. !

-

ఆసియా కప్ 2022 లో భారత జోరుకు బ్రేక్ పడింది. పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో టీమిండియా ఓటమిపాలైంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియాకు గల కారణాలు చాలానే ఉన్నాయి.

టీమిండియా బౌలింగ్‌, ఫీల్డిండ్‌, అలాగే.. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ విభాగంలోనూ విఫలమైంది. అయితే.. తాజాగా టీమిండియా ఓటమి ఊర్వశి రౌతలా కూడా కారణమేనని తెరపైకి తీసుకొచ్చారు నెటిజన్లు. టీమిండియా ఓటమికి బాలీవుడ్ నటి ఊర్వసి కారణమంటూ నెటిజన్లు… ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆమె మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావడం, అంత తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో ఊర్వశి పై విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల రిషబ్ పంత్, ఊర్వశి కి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. దీంతో పంతు ఏకాగ్రత ఆమె పైనే ఉందని అందుకే తొందరగా అవుట్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా…క్రికెట్‌ స్టేడియానికి రాకుండా బ్యాన్ విధించాలని మీమ్స్‌ కూడా చేస్తున్నారు నెటిజెన్లు. కాగా.. పాక్‌ తో జరిగిన మ్యాచ్‌ లో రివర్స్‌ స్వీప్‌ ఆడి.. ఔటైన పంత్‌.. విమర్శల పాలైయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version