భార‌త్ గురించి నీకెందుకు ఆందోళ‌న, అమెరికాలోనే ఉండు.. ప్రియాంక చోప్రాకు నెటిజ‌న్ల‌ సెగ‌..

-

కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లులోకి తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా రైతు సంఘాలు, ప్ర‌జా సంఘాలు, రాజ‌కీయ పార్టీలు, ప‌లు కార్మిక సంఘాల ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం భార‌త్ బంద్‌ను నిర్వ‌హించారు. అయితే ఈ బంద్‌కు న‌టి ప్రియాంక చోప్రా కూడా మ‌ద్ద‌తు తెలిపింది. కానీ నెటిజ‌న్లు ఆమెను ఆడుకుంటున్నారు. ఆమెను వారు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

netizens troll priyanka chopra for her support to farmers

రైతులు మ‌న దేశానికి అన్నం పెట్టే సైనికులు, వారి భ‌యాల‌ను మ‌నం తొల‌గించాలి, వారికి న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నా.. అంటూ రైతుల ఆందోళ‌న‌ల‌కు, భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తుగా ప్రియాంక చోప్రా తాజాగా ట్వీట్ చేసింది. అయితే కొంద‌రు నెటిజన్లు ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమెను దారుణంగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అస‌లు అమెరికాలో ఉండే ప్రియాంక చోప్రాకు ఇక్క‌డి విష‌యాలెందుకు ? ఆమె అమెరికాలోనే ఉండొచ్చు క‌దా.. అంటూ వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తున్నారు.

కాగా ఇంకొంద‌రు తాము రైతుల ఆందోళ‌న‌లు, భార‌త్ బంద్‌కు వ్య‌తిరేకం కాద‌ని, కానీ ప్రియాంక చోప్రాకు అస‌లు ఈ విష‌య‌మై నాలెడ్జ్ ఏమీ లేద‌ని, ఆమె జీరో నాలెడ్జ్ ఉన్న వ్య‌క్తి అని.. క‌నుక ఆమె ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను తెలుపుతున్నామ‌ని కొంద‌రు కామెంట్లు పెట్టారు. దీంతో నెటిజ‌న్ల నుంచి ఆమెకు విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. అయితే వాటిపై ఆమె స్పందిస్తుందా, లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news