ఏపీకి మరో కొత్త సలహాదారు !

-

ఏపీ ప్రభుత్వానికి మొన్న ఒక సలహాదారు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మాజీ సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామా చంద్రమూర్తి సలహాదారుగా తప్పుకున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారు నియామకం జరిగింది. కడప జిల్లా కు చెందిన అంబటి కృష్ణారెడ్డి ని ప్రభుత్వ వ్యవసాయ సలహా దారుగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

jagan

కృష్ణారెడ్డి కి కాబినెట్ ర్యాంక్ హోదా కలిపిస్తున్నట్టు ఉత్తర్వులలో వెల్లడించారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జగన్ సర్కార్ ఈ సలహాదారులను తప్పించాలని చోస్తోందని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇలా ఒక సలహాదారుని నియమించడం ద్వారా దానికి బ్రేకులు వేసినట్టు చెప్పచ్చు. అయితే ఈ సలహాదారుల నియామకం విషయంలో అధికార పార్టీ సొంత్ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉన్నారన్న విషయం మాత్రం సుస్పష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version