ఘట్కేసర్ బీఫార్మాసి విద్యార్థిని ఆత్మహత్య కేసులో ట్విస్ట్

-

ఘట్కేసర్ బీఫార్మాసి విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అదేమంటే విద్యార్థిని నిన్న మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు చెబుతున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు చెబుతున్నారు. అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వైద్యులు యువతికి వైద్యం అందించి సాయంత్రం ఇంటింకి పంపించారు. మళ్లీ రాత్రి కుటుంబ సభ్యులు పడుకున్నాక మరొక సారి విద్యార్థిని షుగర్ మాత్రలు మింగినట్టు చెబుతున్నారు.

దేంతో తెల్లవారుజామున ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు కుటుంబసభ్యులు. ఈ ఉదయం 10.40 నిమిషాలకు ఘట్కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు రాగా ఉదయం 10.55 విద్యార్థిని మృతి చెందినట్టు చెబుతున్నారు. తండ్రి షుగర్ కోసం వాడే ట్యాబ్లెట్లను విద్యార్థిని మింగినట్టు చెబుతున్నారు. ఘటన జరిగిన తరువాత ఘట్‌ కేసర‌లోని అమ్మమ్మ ఇంటికి తీసుకువచ్చిన పేరెంట్స్, కాలేజీ మానిపించి ఇంట్లోనే ఉంచుతున్నట్టు చెబుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా డిప్రెషన్ లో ఉన్న విద్యార్థిని తీవ్రమానసిక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news