ఐపీఎల్ ఈసారి భార‌త్‌లో లేన‌ట్టే..?

-

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)… ఆరంభంలో ఉన్నంత ఆద‌ర‌ణ ఈ లీగ్‌కు ఇప్పుడు లేదు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి వేస‌విలో ఐపీఎల్ చూసే ప్రేక్ష‌కుల సంఖ్య భారీగానే ఉంటోంది. దీనికి తోడు ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు, వివాదాలు ఈ టోర్నీ చుట్టూ తిరుగుతుంటాయి. అయినా వీటన్నింటినీ జ‌నాలు ప‌ట్టించుకునే స్థితిలో లేరు. మ్యాచ్‌ల‌ను చూడ‌డం, ఆనందించ‌డ‌మే ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సింది. అయితే ప్ర‌తి ఏటా ఐపీఎల్ భార‌త్‌లోనూ జ‌రుగుతోంది. కానీ ఈ సారి మాత్రం భార‌త్‌లో ఐపీఎల్ జ‌రిగే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది.

2019 వేస‌విలో పార్లమెంట్ ఎన్నిక‌లు, ప‌లు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీని కార‌ణంగానే ఈ సారి ఐపీఎల్ భార‌త్‌లో జ‌రిగే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. గ‌తంలో ఓ సారి ఇలాంటి ప‌రిస్థితే వ‌చ్చిన‌ప్పుడు సౌతాఫ్రికాలో ఐపీఎల్‌ను నిర్వ‌హించారు. అయితే ఈ సారి సౌతాఫ్రికాతోపాటు ఇంగ్లండ్‌, యూఏఈల‌ను కూడా బీసీసీఐ ప‌రిశీలిస్తోంది.

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లేదా యూఏఈల‌లో ఏదో ఒక వేదిక‌లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేర‌కు బీసీసీఐ ఆయా దేశాల క్రికెట్ బోర్డుల‌తో ఇప్ప‌టికే చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అయితే ఎన్నికలకు ఇంకా స‌మ‌యం ఉంది క‌నుక‌, షెడ్యూల్‌ను బ‌ట్టి కూడా బీసీసీఐ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news