నీ వెంట నేను నడుస్తా.. పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ అండ

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తి కర ట్వీట్‌ చేశారు. ఉడతా ఉడతా ఊచ్‌.. ఎక్కడ కెళ్తోవోచ్‌… రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా అంటూ తన స్టైల్‌ లో ట్వీట్‌ చేశారు. మా వైసిపికి ఇస్తావా… మా థానోస్‌ గూట్లో పెడతావా అని సెటైర్లు పేల్చారు.

విశాఖ బీచ్ లో ఈవినింగ్ వాక్ కు వెళ్లాలని ఉంది అనుమతిస్తారా అంటూ పోలీసులపై సెటైరికల్ గా పవన్ నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పోలీసులు స్పందించలేదు కానీ, కొమరం పులి హీరోయిన్ నికిషా పటేల్ స్పందించింది. “నేను నీ వెంట నడుస్తా” అంటూ ట్వీట్ చేసింది. ఇలా నికిషా పటేల్ స్పందించడం, తన మద్దతు ప్రకటించడంతో జనసైనికులు ఆమెకు థాంక్స్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version