హైకోర్టుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ…సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ !

-

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో వేసిన తాజా పిటిషన్ చర్చనీయాంశంగా మారింది. తాను గవర్నర్ తో జరుపుతున్న సంభాషణ అంతా బయటకు లీక్ అయిందని, ఇది ఎలా సాధ్యం అవుతుందో తెలియడం లేదని తమ సంభాషణ అంతా, తమ ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ  సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయని, ఇదే విషయాన్ని మంత్రులు కూడా చెబుతున్న్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ అంశం మీద సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ లో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్, మంత్రులను ప్రతివాదులుగా చేర్చారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ వేసిన పిటిషన్ మీద కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version