నిమ్మగడ్డ హింట్.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా !

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఆయన త్వరలోనే మరో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంతో ఒక పక్క గొడవ పడుతూనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఆయన తాను పదవి నుంచి దిగిపోక ముందే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కూడా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రేషన్ డోర్ డెలివరీ వాహనాల వినియోగం ఆంక్షలు జీవోలో ప్రస్తావించారని అంటున్నారు. త్వరలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో ఉండడంతో ఎన్నికలు అయ్యేంత వరకు రంగులు మార్చిన రేషన్ సరఫరా వాహనాలే వినియోగించాలని ఆయన సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈనెల 20 తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version