నితిన్ కి భీష్మ సూపర్ హిట్టయిన ఆ ట్రాక్ ఈ ఇయర్ కంటిన్యూ అవుతుందా ..?

-

నాలుగేళ్ళ క్రితం అ..ఆ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ హీరో మళ్ళీ హిట్ అన్న మాట వినలేదు. ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్ని వరసగా ఫ్లాపవుతు వచ్చాయి. దాంతో దాదాపు ఒక సంవత్సరం పాటు సినిమాలు ఏవీ ఒప్పుకోలేదు. బాగా తనని తాను ఎనలైజ్ చేసుకుంటూ కొన్ని కథ లని ఎంచుకున్నాడు. గతంలో ఎందుకు తనకి ఫ్లాప్స్ వచ్చాయో తెలుసుకున్నాడు. అందుకే తనకి బాగా సూటయ్యో కథ లని సెలెక్ట్ చేసుకొని వరసగా సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకున్నాడు.

 

అందులో భాగంగానే ముందు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాని చేశాడు. ఈ సినిమాని కొన్నాళ్ళు ఆలస్యంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్, ట్రైలర్ తో సినిమా బాగా అంచనాలు భారీగా పెరిగాయి. సాంగ్ టీజర్స్ కూడా ఇంకా ప్రేక్షకుల్లో అంచానాలు పెంచాయి. దాంతో సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ రావడం ఆ తర్వాత పెద్ద హిట్ గా నిలిచింది. ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి బాగా కలిసి వచ్చింది. వాస్తవంగా సినిమా రిలీజ్ కి ముందే 10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చింది.

 

అంతే ఇక నితిన్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా మిగతా సినిమాలని స్పీడ్ పెంచాడు. ఆ నెక్స్ట్ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలనుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. కీర్తి సురేష్ నితిన్ కి జంటగా నటిస్తుంది. అయితే అనూహ్యంగా ఏర్పడిన కరోనా కారణంగా ఈ సినిమాకి బ్రేక్ పడింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం ఉంటుందా అన్నది క్వశన్ మార్క్ అయిపోయింది. భీష్మ తో వచ్చిన సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత కమిటయిన ప్రాజెక్ట్స్ కూడా డిలే అవుతున్నాయి. అంతేకాదు నితిన్ మ్యారేజ్ కూడా ప్రస్తుతానికి బ్రేక్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news