50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు !

-

తమిళనాడు రాష్ట్రంలో మరో నిత్య పెళ్లి కూతురు కథనం తెరపైకి వచ్చింది. ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు.. నగలు, డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోంది. సంధ్య వలల్లో చిక్కుకున్న ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మందిని పెళ్లి చేసుకుందట. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Image

తమిళనాడు రాష్ట్రం తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది.

దీంతో అతను అడగగా సంధ్య చంపేస్తానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులో తీసుకొని విచారిస్తే అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news