నేను ఎక్కడ ఉన్నా.. నా హృదయం మాత్రం నల్లగొండ కోసం పరితపిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ లలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాలను అధికారికంగా ప్రారంభించారు.

 

ఈ క్రమంలో చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ,సీతక్క లు మొదటి లబ్ది దారులకు 500 గ్యాస్ సిలిండర్ అందించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నేను ఎక్కడ ఉన్నా.. నా హృదయం మాత్రం నల్లగొండ కోసం పరితపిస్తుందని అని అన్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టిన ముందుగా నా నల్లగొండ బిడ్డలకే అందాలని కోరుకుంటానని పేర్కొన్నారు. దీంతో మంత్రి ట్వీట్ పై రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news