ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతే: రాజ్ నాథ్ సింగ్

-

ఏపీకి రాజధానిగా అమరావతినే బీజేపీ పరిగణనలోకి తీసుకుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని విజయవాడలో బీజేపీ నేతలలో సమావేశంలో తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.వచ్చే ఐదేళ్లలో ఏపీ లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోరాటాల ద్వారానే ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తుందని నేతలకు కర్తవ్యబోధ చేశారు.

విజయవాడలో నరసరావుపేట, గుంటూరు,విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్ తో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news