19 సార్లు లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన మహిళ

-

కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను ఏ విధంగా భయపెడుతుందో అందరికి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఒక సంచలన విషయం బయటపడింది. ఒక మహిళకు ఒక్కసారి కూడా లక్షణాలు లేకుండా 19 సార్లు కరోనా వైరస్ బయటపడింది. ఈ పరిణామం చూసి అటు వైద్యులు ఇటు అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

కరోనా వైరస్ వస్తే… సాధారణంగా 20 రోజుల్లోపు దాదాపుగా కోలుకునే అవకాశం ఉంటుంది. కాని సదరు మహిళ మాత్రం 42 రోజులు అయినా కోలుకోలేదు. 19 సార్లు పరిక్షలు చేసినా సరే ఆమెకు పాజిటివ్ అనే వచ్చింది. కేరళలోని పట్టనాంతిట్టకు చెందిన 62 ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులు ఇటలీ నుంచి రాగా… వారి వలన ఆమెకు కరోనా వైరస్ వచ్చింది. మార్చ్ 10 న ఆస్పత్రిలో జాయిన్ చేసారు.

42 రోజుల పాటు చికిత్స అందించినా సరే… ఆమెకు కరోనా పరీక్షలో పాజిటివ్ అనే వస్తుంది. దీనితో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటీ అంటే ఆవిడకు ఒక్క లక్షణం కూడా లేదు. దీనిపై అధికారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news